రూ. 27 లక్షలు చెల్లించిన బోర్డు సభ్యులు
తిరుమల – వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్ల జారీలో జనవరి 8న జరిగిన తోపులాటలో మృతి చెందిన కేరళ రాష్ట్రం పాలక్కాడ్ కు చెందిన వి.నిర్మల కుటుంబానికి రూ.27 లక్షల పరిహారాన్ని టిటిడి బోర్డు సభ్యులు అందజేశారు. టిటిడి పాలక మండలి నిర్ణయం మేరకు రూ.25 లక్షలు, టిటిడి బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సొంత నిధులు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.27 లక్షలు అందజేశారు.
మృతురాలు నిర్మల ఏకైక కుమార్తె కౌశిగాకు పరిహారం చెక్ ను టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్, రామ్మూర్తి, శాంతారాం అందజేసి పరామర్శించారు.
టిటిడి పాలక మండలి నిర్ణయం మేరకు బాధితుల కుటుంబంలో ఒకరైన కౌశిగాకు టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వివరాలను బోర్డు సభ్యుల బృందం తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పరిహారం ఇచ్చింది టీటీడీ. ఇదే సమయంలో ఈ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేశారు.