Saturday, April 19, 2025
HomeDEVOTIONALదివ్య ద‌ర్శ‌నం టోకెన్ల జారీ కేంద్రం తనిఖీ

దివ్య ద‌ర్శ‌నం టోకెన్ల జారీ కేంద్రం తనిఖీ

ప‌రిశీలించిన ఈవో జె. శ్యామ‌ల రావు

తిరుప‌తి – తిరుపతి లోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం, ఎస్ఎస్ డి టోకెన్ల జారీ కేంద్రాన్ని టిటిడి ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీర బ్ర‌హ్మంతో కలిసి పరిశీలించారు.

అలిపిరి వద్ద భక్తులకు ఇదివరకు జారీ చేస్తున్న దివ్య దర్శనం టోకెన్లను పునః ప్రారంభించేందుకు సాధ్యసాధ్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్ఎస్ డి టోకెన్ల జారీ ప్రక్రియను, క్యూ లైన్లను, ఎస్విబిసి మాస్టర్ కంట్రోల్ రూమ్ ను, ఎస్విబిసి పాత పరిపాలన భవనాన్ని పరిశీలించారు.

భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్లు జారీ చేయడానికి శాశ్వత క్యూలైన్లు, ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తరువాత అలిపిరి పాదాల మండపం వద్ద ఇదివరకు దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని, టిటిడి జల ప్రసాదాన్ని, లగేజీ కౌంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈవో వెంట సివి అండ్ ఎస్వో శ్రీధర్, సిఈ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సిఈఓ షణ్ముఖ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments