Sunday, April 20, 2025
HomeDEVOTIONALనీటి కొర‌త భ‌క్తులు జాగ్ర‌త్త - టీటీడీ ఈవో

నీటి కొర‌త భ‌క్తులు జాగ్ర‌త్త – టీటీడీ ఈవో

పొదుపుగా వాడాల‌ని శ్యామ‌ల రావు పిలుపు

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి నీరు స‌రిపోద‌ని తెలిపింది. తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొంది.

తిరుమలలో ప్రతి రోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారని స్ప‌ష్టం చేశారు టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు. అందులో 18 లక్షల గ్యాలెన్లు తిరుమల డ్యామ్‌ల నుండి మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి సేకరిస్తున్నట్లు తెలిపారు.

తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమార ధార, పసుపు ధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొన్నారు ఈవో.

అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టిటిడి నిర్ణయం తీసుకుంద‌ని తెలిపారు.

ఈ మేరకు భక్తులు, స్థానికులు నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించు కోవాలని జె. శ్యామ‌ల రావు కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments