Monday, April 21, 2025
HomeDEVOTIONALతిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు

తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు

భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడ‌దు

తిరుమల – టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళా మాత కేంద్రీయ వంటశాలను పరిశీలించారు ఈవో. నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ-5ను తనిఖీ చేశారు. అక్కడ పనుల పురోగతి గురించి ఇంజినీరింగ్ అధికారులతో ఆరా తీశారు.

అనంతరం కౌస్తుభం, సప్తగిరి, ఎస్ఎంసీ, షాపింగ్ కాంప్లెక్స్ వద్ద హోటళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శిలా తోరణం వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు.

ఔటర్ రింగ్ రోడ్డులో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్మిస్తున్న నూతన క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఫుడ్ కోర్టులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్య నారాయణ, ఈ ఈ లు వేణు గోపాల్, సుబ్రహ్మణ్యం, డీ ఈ చంద్రశేఖర్, ఎస్టేట్స్ అధికారి వెంకటేశ్వరులు, డిప్యూటీ ఈఓ (హెల్త్) ఆశాజ్యోతి, హెల్త్ అధికారి డా. మధుసూదన ప్రసాద్, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments