Monday, April 7, 2025
HomeDEVOTIONAL12న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

12న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

ఘ‌నంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ

తిరుమల – తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసి వున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 12న జరుగనుంది.

పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్య తీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం, పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగి ముక్తి సమ కూరుతుందని పురాణ వైశిష్ట్యం.

ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments