Sunday, June 1, 2025
HomeSPORTSవైభ‌వ్ సూర్య‌వంశీ ఆట తీరు అద్భుతం

వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట తీరు అద్భుతం

ప్ర‌శంస‌లు కురిపించిన పీఎం మోదీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు ప్ర‌ముఖ యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య వంశీ త‌న పేరెంట్స్ తో క‌లిసి. తాజాగా జ‌రిగిన ఐపీఎల్ 2025లో సూప‌ర్ షో తో ఆక‌ట్టుకున్నాడు. కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సులోనే త‌ను సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. వ‌ర‌ల్డ్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ న‌మోదు చేశాడు. అతి పిన్న వ‌య‌సులోనే అద్భుత‌మైన సెంచ‌రీని అతి త‌క్కువ బంతుల్లో చేశాడు. త‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. టోర్నీలో కీల‌క‌మైన పాత్ర పోషించాడు. అయితే గ‌త సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ దాకా వెళ్లిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఈసారి ఆశించిన మేర రాణించ లేక పోయింది జ‌ట్టు.

ప్ర‌ధానంగా కెప్టెన్ సంజూ శాంస‌న్ ఆట మ‌ధ్య‌లో తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో చాలా మ్యాచ్ ల‌న్నీ స్టాండింగ్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ వ్య‌వ‌హ‌రించాడు. త‌న టీంలో వైభ‌వ్ సూర్య వంశీ ఆడ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశాడు. ఇదిలా ఉండ‌గా దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన వేలం పాట‌లో ఏకంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఏరికోరి రూ. 1.10 కోట్ల‌కు వైభ‌వ్ సూర్య వంశీని తీసుకున్నాడు. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వమ్ము చేయ‌లేదు ఈ యంగ్ క్రికెట‌ర్. ఈ సంద‌ర్బంగా వైభ‌వ్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. త‌ను రాబోయే రోజుల్లో టీమిండియా త‌ర‌పున ఆడాల‌ని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments