Wednesday, April 2, 2025
HomeNEWSANDHRA PRADESHవ‌ల్ల‌భ‌నేని వంశీ రిమాండ్ పొడిగింపు

వ‌ల్ల‌భ‌నేని వంశీ రిమాండ్ పొడిగింపు

ఏప్రిల్ 9 దాకా పొడిగించిన సీబీఐ కోర్టు

విజ‌య‌వాడ – గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. కాగా ఈ కేసుకు సంబంధించి నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని ఈ రోజు ఉదయం జిల్లా జైలు నుంచి గన్నవరం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని కూడా పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరు పరిచారు.

ఈ కేసులో వంశీకి ఏప్రిల్ 9 వరకు సీఐడీ కోర్టు రిమాండ్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. సీఐడీ కోర్టు రిమాండ్‌ను పొడిగించ‌డంతో ఆయ‌న‌ను విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లించారు. మ‌రోవైపు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. వంశీ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ కోర్టులో కూడా వంశీకి బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. నేటి సాయంత్రం 4 గంటల తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments