Tuesday, April 22, 2025
HomeDEVOTIONALశ్రీ‌రంగం ఆల‌యానికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

శ్రీ‌రంగం ఆల‌యానికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

స‌మ‌ర్పించిన టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు

తిరుప‌తి – తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రముఖ శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీ రంగనాథ స్వామికి టీటీడీ ఈవో జె శ్యామలరావు పట్టు వస్త్రాలను సమర్పించారు.

దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు పట్టు వస్త్రాలను 2008 ఏడాది నుంచి టిటిడి సమర్పిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈవో.

అంతకు ముందు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు రంగం ఆలయ జాయింట్ కమిషనర్ మరియప్పన్ స్వాగతం పలికారు. అనంతరం ఈవో పీఠాధిపతికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రధాన ఆలయ సముదాయంలో ఉన్న మూల విరాట్ ఇతర ఉప ఆలయాలను దర్శనం చేసుకున్నారు.

సాధారణంగా శ్రీరంగం ఆలయ అధికారులు ప్రతి సంవత్సరం ఆణివార ఆస్థానం రోజున తిరుమల ఆలయానికి వస్త్రాలను సమర్పిస్తారు, అయితే ఈ పవిత్ర కార్తీక మాసం ఏకాదశి రోజున శ్రీ రంగం ఆలయానికి టిటిడి పట్టు వస్త్రాలను అందజేస్తుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాధం, ఇతర టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments