సంచలన ప్రకటన చేసిన టీటీడీ పాలకమండలి
తిరుమల – టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను శ్రీవారి ప్రసాదాలతో పాటు కియోస్క్ ల ద్వారా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. లడ్డూలను ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్లు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో మూడింటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. తిరుమల వ్యాప్తంగా శ్రీ పద్మావతి విచారణ కేంద్రం, సీఆర్వో విచారణ కేంద్రం, ప్రముఖ అతిథి గృహాల వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను కూడా కియోస్క్ల ద్వారా త్వరలో పొందేలా అందుబాటు లోకి తీసుకు వస్తామని వెల్లడించింది.
ఇదిలా ఉండగా భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఉచితంగా బస్సు సేవలను ప్రారంభించింది. దీనికి ఆర్టీసీ బస్సులు సహకరించనున్నాయి. తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీతో కలిసి ఉచిత సర్వీసులను టీటీడీ తీసుకొచ్చింది. శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులూ సేవలు అందిస్తున్నాయి. సగటున మూడు-నాలుగు నిమిషాలకో బస్సు ప్రతి స్టాప్లో భక్తులకు అందుబాటులో ఉండనుంది.