కంటతడి పెట్టిన స్టార్ క్రికెటర్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ పోరులో 18 ఏళ్ల సుదీర్గ విరామం తర్వాత ఆర్సీబీ విజేతగా నిలిచింది. ప్రత్యర్థి పంజాబ్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సందర్బంగా ఐపీఎల్ సీజన్ నుంచి బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇటీవలే టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. ఆట పరంగా పరుగుల వరద పారించిన తను ఇలా అర్ధాంతరంగా నిష్క్రమించడం బాధకు గురి చేసింది. తన కల నెరవేరడంతో కప్ ను ముద్దాడాడు. తట్టుకోలేక కోహ్లీ భావోద్వేగాని లోనయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా మ్యాచ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ టాస్ గెలిచాడు. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 190 రన్స్ చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ 43 పరుగులతో రాణించగా పాటిదార్ 26 కీలక పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు పర్వాలేదని అనిపించారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 184 పరుగులకే పరిమితమైంది. ప్రభ్ సిమ్రన్ సింగ్ ప్రియాన్ష్ ఆర్య ధాటిగా ఆడేందుకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు.
తొలి వికెట్ భాగస్వామ్యానికి 43 రన్స్ చేశారు. ప్రధానంగా కృనాల్ పాండ్యా వీరి జోడికి బ్రేక్ వేశాడు. తను 4 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. తనతో పాటు భువనేశ్వర్ కుమార్, జోషల్ వుడ్ , రొమారియా సెఫర్డ్ సత్తా చాటారు.