23 వరకు మహా క్రతువు
వరంగల్ జిల్లా – ప్రసిద్ద క్షేత్రం యాదగిరిగుట్టలో మహా కుంభ సంప్రోక్షణ జరగనుంది. ఈనెల 23 వరకు మహాక్రతువు నిర్వహించనున్నారు. ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడం పనులు పూర్తయ్యాయి. 108 మంది రుత్వికులతో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలు తీసుకు వచ్చారు. కొండపైన ఐదు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీలక్ష్మీ హవన హోమాలు నిర్వహిస్తాయి. విమాన రాజ గోపురానికి 25 కలశాలతో అభిషేకం చేస్తారు.
పెద్ద కుండానికి అనుబంధంగా మరో నాలుగు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీ లక్ష్మి హవన హోమాలు నిర్వహిస్తారు. 23న విమాన రాజగోపురానికి 25 కలశాలతో అభిషేకం చేపట్టారు.
19 నుంచి 22 వరకు 108 మంది రుత్విక్కులతో పూజలు చేస్తారు. సుదర్శన హోమం, నారసింహ హోమం 23న సుమారు లక్షమందికి పులిహోర ప్రసాదం పంపిణీ చేస్తామని ప్రకటించారు నిర్వాహకులు. మార్చి1 నుంచి ప్రారంభం కానున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.