Sunday, April 20, 2025
HomeNEWSANDHRA PRADESHవిద్యార్థుల ఘ‌ట‌న జ‌గ‌న్ ఆవేద‌న

విద్యార్థుల ఘ‌ట‌న జ‌గ‌న్ ఆవేద‌న

మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాలి

అమ‌రావ‌తి – కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాల‌యంకు చెందిన వేద పాఠ‌శాల డ్రైవర్ తో పాటు ముగ్గురు వేద విద్యార్ధులు మరణించడంపై మాజీ సీఎం వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా…వాహనం బోల్తా పడింది సింధ‌నూరు వ‌ద్ద‌. అక్క‌డిక‌క్క‌డే డ్రైవ‌ర్ తో పాటు ముగ్గురు స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసిందన్నారు జ‌గ‌న్ రెడ్డి.

చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నానని పేర్కొన్నారు. త‌మ పార్టీ ప‌రంగా కూడా సాయం చేసేందుకు ముందుకు వ‌స్తామ‌న్నారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద కూడ‌ద‌ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments