నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. కూటమి సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబు పాలన అంతా బక్వాస్ అంటూ పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయి పోయాయన్నారు. రాజకీయ కక్షలతో నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్ప కూలిపోయిందన్నారు. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయిందంటూ వాపోయారు.
అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ధ్వజమెత్తారు జగన్ రెడ్డి. ఇందుకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్తో దాడి చేయిస్తారా అని నిలదీశారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిదంటూ ప్రశ్నించారు.