నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఏపీ కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఎందుకు విచారణ చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు. ఇదేనా ప్రజా ప్రభుత్వ పాలన అంటూ ప్రశ్నించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
గత జగన్ రెడ్డి హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం
కూటమి సర్కార్ ట్రెండ్గా పెట్టుకుందంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిల. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై చర్య తీసుకున్న పాపాన పోలేదన్నారు.
రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు..కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారు. కూటమి ప్రభుత్వాన్ని
కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏపీని పోర్టులకు హబ్గా మార్చే పాలసీలు సరే. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి అని నిలదీశారు షర్మిల.
ప్రతి ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసి ఇచ్చిందని ఆరోపించారు. నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9 వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారని మండిపడ్డారు.
2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను అదానీకి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు,ఇచ్చిన హామీలకు, ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలకు ఏ మాత్రం పొంతన లేదన్నారు.