మహిళల మీద నోరు పారేసుకుంటే ఎలా..?
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మహిళల మీద సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలను పిశాచులతో పోల్చుతారా? రాక్షసులు అంటారా? సంకర జాతి అని అవమానిస్తారా ?
చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడానికి మీకు ఎందుకు నామోషీ ? అంటూ నిలదీశారు వైఎస్ షర్మిలా రెడ్డి. YCP చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తోందన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఇదే సజ్జల కొడుకు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని నన్ను కూడా వదిలి పెట్టలేదన్నారు వైఎస్ షర్మిల. సైతాన్ సైన్యంతో నా మీద తప్పుడు ప్రచారం చేయించారని వాపోయారు. వైఎస్ బిడ్డ అని, ఒక మహిళా అని చూడకుండా కించ పరిచారని ఆవేదన చెందారు. జగన్ నా అక్క చెల్లెళ్ళు అంటాడు కానీ
సొంత చెల్లికి మర్యాద లేదన్నారు. ఇక రాష్ట్రంలో వీళ్ళు మహిళలకు ఏం గౌరవం ఇస్తారంటూ నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. సముద్రంలో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందన్నారు. అప్పుడప్పుడు చెత్త పైకి వస్తుందన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే లాగే వాళ్ళు కూడా ఉన్నారన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందని, అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు వైఎస్ షర్మిలా రెడ్డి.