నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఎందుకు ఇవ్వ‌లేదు..?

Spread the love

కూట‌మి స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. త‌న‌కు ప్ర‌తిపక్ష హోదా ఎందుకు ఇవ్వ‌డం లేదో చెప్పాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఉంద‌న్నారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న‌ది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. బుధ‌వారం జ‌గ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదో ముందు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చాడో తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

సభలో ఏమీ జరగక పోయినా ఒక డ్రామా క్రియేట్ చేశాడ‌ని, ఆ త‌ర్వాత చాలా తెలివిగా ఏడ్పు రాక పోయినా ఏదో జ‌రిగి పోయిన‌ట్లు, కొంప‌లు కూలి పోయిన‌ట్లు తెగ న‌టించాడ‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న చేసిన న‌ట‌న‌ను చూసి ప్ర‌తి ఒక్క‌రు విస్తు పోయార‌న్నారు. సినిమాల‌లో న‌టించే న‌టులు సైతం ఆశ్చ‌ర్య పోయేలా ఏడ్చాడ‌ని, దీంతో అంద‌రూ త‌న‌కు ఏదో అయి పోతోంద‌ని విస్మ‌యానికి లోన‌య్యార‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి. తాను గన‌క శాస‌న స‌భ‌లో ఉంటే అసెంబ్లీకి రానంటూ వెళ్లి పోయాడ‌ని, ఆ త‌ర్వాత ప‌త్తా లేకుండా పోయాడ‌ని ఇప్పుడు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు మాజీ సీఎం. అసెంబ్లీ రికార్డులు మొత్తం తిరగేశాన‌ని, కానీ ఎక్క‌డా మావాళ్లుతప్పు మాట్లాడలేద‌ని, ఆ విష‌యం తేలి పోయింద‌న్నారు.

  • Related Posts

    కేంద్ర స‌ర్కార్ కు టీడీపీ పూర్తి మ‌ద్ద‌తు

    Spread the love

    Spread the loveమహిళా సాధికారత దిశగా అడుగులు న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట ప‌ట్టారు. పార్ల‌మెంట్ లో మూడు చారిత్రాత్మ‌క‌మైన బిల్లులు ప్ర‌వేశ పెట్టేందుకు శ్రీ‌కారం చుట్టారు . ఈ సంద‌ర్బంగా…

    రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడ‌ల్ ప‌నికి రాదు

    Spread the love

    Spread the loveపార్ల‌మెంట్ లో బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ తేజ‌స్వి సూర్య‌. గురువారం పార్ల‌మెంట్ సాక్షిగా ఆగ్ర‌హం వ్య‌క్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *