నేపాల్ లో చిక్కుకున్న వారిపై లోకేష్ ఆరా

తెలుగు వారిని ర‌క్షించేందుకు చ‌ర్య‌లు

అమ‌రావ‌తి : నేపాల్ లో తీవ్ర సంక్షోభం నెల‌కొంది. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. దెబ్బ‌కు ప్ర‌ధానితో పాటు మంత్రులు రాజీనామాలు చేశారు. సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోప‌డంతో దీనిని నిర‌సిస్తూ రోడ్డెక్కారు. 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ త‌రుణంలో ఆర్మీ దెబ్బ‌కు ప్ర‌ధాని త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. నేపాల్ లో ఏపీకి చెందిన తెలుగు వారు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. దీని గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కి చేరుకున్నారు. ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం అయ్యారు.

నేపాల్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను మంత్రి నారా లోకేష్ కు వివరించారు ఏపీ భవన్ అధికారులు. ఇప్పటి వరకూ 215 తెలుగు వారు చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం. నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలని మంత్రి ఆదేశించారు. అక్కడ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి అక్కడ అవసరమైన తక్షణ సహాయం అందించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం పై వివిధ అధికారులకు బాధ్యతలు అప్పగించారు నారా లోకేష్.

ప్రతి రెండు గంటలకు నేపాల్ లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని స్ప‌ష్టం చేశారు.
నేపాల్ లో చిక్కుకున్న కొంతమంది తెలుగువారితో విడియో కాల్ లో మాట్లాడారు. అక్కడ ఉన్న పరిస్థితిని మంత్రి నారా లోకేష్ కు వివరించారు సూర్య ప్రభ. ముక్తి నాథ్ దర్శనానికి వెళ్ళి ఒక హోటల్ లో చిక్కుకున్నాం అని చెప్పింది. హోటల్ నుండి బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని సూచించారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *