నేపాల్ లో చిక్కుకున్న వారిపై లోకేష్ ఆరా

Spread the love

తెలుగు వారిని ర‌క్షించేందుకు చ‌ర్య‌లు

అమ‌రావ‌తి : నేపాల్ లో తీవ్ర సంక్షోభం నెల‌కొంది. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. దెబ్బ‌కు ప్ర‌ధానితో పాటు మంత్రులు రాజీనామాలు చేశారు. సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోప‌డంతో దీనిని నిర‌సిస్తూ రోడ్డెక్కారు. 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ త‌రుణంలో ఆర్మీ దెబ్బ‌కు ప్ర‌ధాని త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. నేపాల్ లో ఏపీకి చెందిన తెలుగు వారు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. దీని గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కి చేరుకున్నారు. ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం అయ్యారు.

నేపాల్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను మంత్రి నారా లోకేష్ కు వివరించారు ఏపీ భవన్ అధికారులు. ఇప్పటి వరకూ 215 తెలుగు వారు చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం. నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలని మంత్రి ఆదేశించారు. అక్కడ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి అక్కడ అవసరమైన తక్షణ సహాయం అందించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం పై వివిధ అధికారులకు బాధ్యతలు అప్పగించారు నారా లోకేష్.

ప్రతి రెండు గంటలకు నేపాల్ లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని స్ప‌ష్టం చేశారు.
నేపాల్ లో చిక్కుకున్న కొంతమంది తెలుగువారితో విడియో కాల్ లో మాట్లాడారు. అక్కడ ఉన్న పరిస్థితిని మంత్రి నారా లోకేష్ కు వివరించారు సూర్య ప్రభ. ముక్తి నాథ్ దర్శనానికి వెళ్ళి ఒక హోటల్ లో చిక్కుకున్నాం అని చెప్పింది. హోటల్ నుండి బయటకు రావొద్దని, ప్రతి రెండు గంటలకు ఒకసారి మీతో సంప్రదింపులు చేస్తామని సూచించారు.

  • Related Posts

    కేంద్ర స‌ర్కార్ కు టీడీపీ పూర్తి మ‌ద్ద‌తు

    Spread the love

    Spread the loveమహిళా సాధికారత దిశగా అడుగులు న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట ప‌ట్టారు. పార్ల‌మెంట్ లో మూడు చారిత్రాత్మ‌క‌మైన బిల్లులు ప్ర‌వేశ పెట్టేందుకు శ్రీ‌కారం చుట్టారు . ఈ సంద‌ర్బంగా…

    రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడ‌ల్ ప‌నికి రాదు

    Spread the love

    Spread the loveపార్ల‌మెంట్ లో బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ తేజ‌స్వి సూర్య‌. గురువారం పార్ల‌మెంట్ సాక్షిగా ఆగ్ర‌హం వ్య‌క్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *