త్వ‌ర‌లోనే తెలంగాణ టీడీపీ చీఫ్ నియామ‌కం

Spread the love

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

హైద‌రాబాద్ : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తెలంగాణ టీడీపీ నేతలతో ఆయ‌న ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు.
తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు.సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో నేతలు సమావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమావేశంలో ప్ర‌త్యేకంగా చ‌ర్చించారు. ఇప్పటికే కసరత్తు పూర్తియిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీ నియమించాలన్న అంశం పైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం చేసినట్లు చంద్రబాబుకు నాయకులు వివరించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టివ్ గా పని చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని పార్టీ బాస్ కు తెలిపారు.రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నియామకం ఆలస్యం అయ్యేటట్లు అయితే.. ఈ లోపు ముఖ్య నాయకులతో కలిపి రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు.

అందరి అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని సూచించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చే వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని ఈ మేరకు స్పష్టం చేశారు.

  • Related Posts

    అందంగా ముస్తాబైన న‌ల్ల చెరువు

    Spread the love

    Spread the loveప్రారంభానికి సిద్ద‌మైంద‌న్న హైడ్రా హైద‌రాబాద్ : ఎటు చూసినా నివాసాలు.. వ‌ర‌ద నీరు ఎటు వెళ్లాలో తెలియ‌ని నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన ప్రాంతంలో కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై బిక్కు బిక్కుమంటున్న త‌రుణంలో హైడ్రా దృష్టి ఆ…

    పాల‌న‌పై ప‌ట్టు కోల్పోయిన రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : పాల‌నా ప‌రంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప‌ట్టు పెంచుకోలేద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. పాల‌న చేత‌కాక ఎడా పెడా ఐఏఎస్ లు, ఐపీఎస్ అధికారుల‌ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *