సుభిక్షంగా ఉండాల‌ని మ‌ల్ల‌న్న‌ను కోరుకున్నా

Spread the love

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

నంద్యాల జిల్లా : దేశంలోని ప్ర‌ముఖ జ్యోతిర్లింగాల‌లో ఒక‌టైన నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీ‌శైల భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామి ఆల‌యాన్ని గురువారం అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. పూజారులు పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు ప్ర‌ధానికి. ఆల‌యంలోని మ‌ల్ల‌న్న స్వామికి అభిషేకం చేశారు. పూజ‌లు చేసిన అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రిని ఆశీర్వదించారు. తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు మ‌ల్ల‌న్న చిత్ర ప‌టాన్ని పీఎంకు ఇచ్చారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పూజ‌లు చేసిన అనంత‌రం త‌న సంతోషాన్ని పంచుకున్నారు. త‌న జీవితంలో ఈ రోజు మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు. న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలో కొలువు తీరిన ఈ పుణ్య క్షేత్రం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు న‌రేంద్ర మోదీ. అనంత‌రం శ్రీ‌శైలంలోని శివాజీ మ్యూజియంను సంద‌ర్శించారు. అక్క‌డి నుంచి క‌ర్నూలుకు బ‌య‌లుదేరి వెళ్లారు.

  • Related Posts

    టీటీడీ క‌ళ్యాణ మండ‌పాల‌పై ఈవో స్పెష‌ల్ ఫోక‌స్

    Spread the love

    Spread the loveభ‌క్తుల నుండి అభిప్రాయాల సేక‌ర‌ణ కోసం హెల్ప్ లైన్ తిరుప‌తి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న ఈవోగా కొలువు తీరాక టీటీడీలో ప్ర‌క్షాళ‌న ప్రారంభించారు. కీల‌క నిర్ణ‌యాలకు శ్రీ‌కారం చుట్టారు.…

    తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీటీడీ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమలలో ఈనెల 25న రథ సప్తమి సందర్భంగా 24, 26వ తేదీల వరకు SSD టోకెన్ల జారీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *