మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాలి

Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : పేద విద్యార్థుల‌కు మెరుగైన విద్య‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. స‌చివాల‌యంలో విద్యా రంగంపై స‌మీక్ష చేప‌ట్టారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఏరియాలో ఉన్న పాఠశాలల పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని స్ప‌ష్టం చేశారు. స్థల సమస్య ఉంటే ప‌క్క‌నే ఉన్న పాఠ‌శాల‌ల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు సీఎం.

సౌకర్యాల లేమి ఉన్న పాఠశాలలను దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడకు తరలిస్తే ఇబ్బందులు అంటూ ఉండ‌వ‌న్నారు రేవంత్ రెడ్డి. నర్సరీ నుంచి 4 వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ నూతన పాఠశాలలు ప్రారంభం 2026 అకడమిక్ సంవత్సరం నుంచి అమలు జరిగేలా కార్యచరణ రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

  • Related Posts

    జ‌గ‌న్ చేసిన దుర్మార్గాల‌ను స‌రిచేస్తున్నాం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నంద్యాల జిల్లా డోన్ లో ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా…

    చంద్రబాబును విమర్శించే అర్హత జ‌గ‌న్ కు లేదు

    Spread the love

    Spread the loveరాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *