భారీ బండరాయిని తొల‌గించిన హైడ్రా

Spread the love

సంచారం లేక పోవ‌డంతో త‌ప్పిన ప్ర‌మాదం

హైద‌రాబాద్ : మ‌ల్కాజ్ గిరిలోని గౌత‌మ్ న‌గ‌ర్ లో గుట్ట పైనుంచి ఊహించని విధంగా పెద్ద బండరాయి ఉదయం 11 గంటల ప్రాంతంలో పడింది. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయాన్ని తెలుసుకున్న హైడ్రా DRF, GHMC సిబ్బందితో కలసి బండరాయిని ముక్కలు చేసి పక్కకు తొలగించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన జల్లులు కురుస్తుండడంతో ఈ బండ రాయి కింద మట్టి కరిగి జారి పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మల్కాజిగిరి గౌతమ్ నగర్ లో మల్లికార్జున నగర్లో ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి బండరాయి పడడంతో కిందనే పార్కు చేసి ఉన్న చెత్త తరలించే GHMC ట్రాలీ నుజ్జయ్యింది.

గతంలో ఇక్కడ బండరాళ్లు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. మే నెలలో కురిసిన వర్షాల సమయంలో కూడా బండ రాళ్ళు పడ్డాయి. చెత్త సేకరించిన వారు ప్రమాదకరంగా ఇదే గుట్టపై తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని వుండగా ప్రమాదాన్ని ముందే ఊహించిన హైడ్రా వాటిని ఈ ఏడాది జూలైలో ఖాళీ చేయించింది. లేని పక్షంలో పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు అలాగే ఇక్కడ ప్రతి శనివారం సంత కూడా జరుగుతుందని. స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు పడిన బండ రాయిని GHMC తో కలిసి హైడ్రా DRF సిబ్బంది రాత్రి 9.30 గంటలకు తొలగించారు.

  • Related Posts

    16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా నిషేధం

    Spread the love

    Spread the loveకర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. గ‌త కొంత కాలంగా పిల్ల‌ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది సోష‌ల్…

    స్పీక‌ర్ అయ్య‌న్న‌ను క‌లిసిన ప‌వ‌న్ కళ్యాణ్

    Spread the love

    Spread the loveఅభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని శుక్రవారం స్పీకర్ చాంబర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *