భారీ బండరాయిని తొల‌గించిన హైడ్రా

Spread the love

సంచారం లేక పోవ‌డంతో త‌ప్పిన ప్ర‌మాదం

హైద‌రాబాద్ : మ‌ల్కాజ్ గిరిలోని గౌత‌మ్ న‌గ‌ర్ లో గుట్ట పైనుంచి ఊహించని విధంగా పెద్ద బండరాయి ఉదయం 11 గంటల ప్రాంతంలో పడింది. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయాన్ని తెలుసుకున్న హైడ్రా DRF, GHMC సిబ్బందితో కలసి బండరాయిని ముక్కలు చేసి పక్కకు తొలగించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన జల్లులు కురుస్తుండడంతో ఈ బండ రాయి కింద మట్టి కరిగి జారి పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మల్కాజిగిరి గౌతమ్ నగర్ లో మల్లికార్జున నగర్లో ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి బండరాయి పడడంతో కిందనే పార్కు చేసి ఉన్న చెత్త తరలించే GHMC ట్రాలీ నుజ్జయ్యింది.

గతంలో ఇక్కడ బండరాళ్లు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. మే నెలలో కురిసిన వర్షాల సమయంలో కూడా బండ రాళ్ళు పడ్డాయి. చెత్త సేకరించిన వారు ప్రమాదకరంగా ఇదే గుట్టపై తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని వుండగా ప్రమాదాన్ని ముందే ఊహించిన హైడ్రా వాటిని ఈ ఏడాది జూలైలో ఖాళీ చేయించింది. లేని పక్షంలో పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు అలాగే ఇక్కడ ప్రతి శనివారం సంత కూడా జరుగుతుందని. స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు పడిన బండ రాయిని GHMC తో కలిసి హైడ్రా DRF సిబ్బంది రాత్రి 9.30 గంటలకు తొలగించారు.

  • Related Posts

    సీఎం చంద్ర‌బాబుకు టీటీడీ అర్చ‌కుల ఆశీర్వాదం

    Spread the love

    Spread the loveఏప్రిల్ 20వ తేదీన ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. సుదీర్ఘ‌మైన రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన చ‌రిత్ర‌. 40 ఏళ్ల‌కు పైగా…

    తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

    Spread the love

    Spread the loveకోయంబత్తూరు, హోసూరు, తళ్లి, అవడి, మధురైలలో త‌మిళ‌నాడు : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *