బీసీలను వేధించిన జగన్ : కొల్లు రవీంద్ర

విజ‌య‌వాడ : రాష్ట్రంలో బీసీల‌ను కావాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేధింపుల‌కు గురి చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. అందుకే జ‌నం త‌న‌ను బండ‌కేసి కొట్టార‌ని అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు. కేవ‌లం త‌న పార్టీని, త‌న‌ను 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా ఇంకా చిల్ల‌ర వేషాలు వేస్తున్నారంటూ మండిప‌డ్డారు. బ‌హుజ‌నుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. గౌతు లచ్చన్న స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు అన్నింటా బీసీలకు పెద్ద పీట వేస్తున్నారని మంత్రి తెలిపారు. త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తున్నారని ప్ర‌క‌టించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిథ్యం పెంచేలా చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. బీసీల పతనాన్ని జగన్ కోరుకున్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టి, తనతో సహా ఎందరో బీసీలను జైల్లో పెట్టారన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తనపై హత్య కేసు సైతం బనాయించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు అన్నింటా బీసీలకు అండగా నిలుస్తున్నారన్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. బీసీల సంక్షేమం కోరుతూ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా బీసీ యువతకు అండగా నిలుస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు.

  • Related Posts

    జగన్ హయాంలో బీసీల హత్యలు : మంత్రి అనగాని

    విజ‌య‌వాడ : బీసీల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతుల కోసం మొట్ట మొదటిసారి పాదయాత్ర చేసిన ఘనత కూడా ఆయనదేనన్నారు. శ్రీకాకుళం నుంచి చైన్నై వరకూ…

    దేశంలోనే తెలంగాణ‌ను టాప్ లో నిల‌బెడ‌తాం

    జ‌గిత్యాల జిల్లా : 2047 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. జగిత్యాలలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, స్వాతంత్ర్య సమరయోధుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *