ఏపీ సీఐఐ స‌ద‌స్సుకు విశాఖ ముస్తాబు

Spread the love

స‌క్సెస్ చేయాల‌ని ఆదేశించిన చంద్ర‌బాబు

విశాఖ‌ప‌ట్నం : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఏపీ సీఐఐ స‌మ్మిట్ 2025 కు విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం వేదిక కానుంది. ఈనెల 14, 15వ తేదీల‌లో రెండు రోజుల పాటు నిర్వ‌హిస్తోంది రాష్ట్ర కూట‌మి స‌ర్కార్. ఇందులో భాగంగా స‌చివాల‌యంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష చేప‌ట్టారు. ఎప్ప‌టిక‌ప్పుడు నిర్వాహ‌కుల‌కు సూచ‌న‌లు చేస్తూ మంత్రుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లండ‌న్, అమెరికా, సింగపూర్, దుబాయ్ దేశాల‌లో ప‌ర్య‌టించారు. ఔత్సాహికులు, కంపెనీల ప్ర‌తినిధులు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, సీఈఓలు, క‌న్స‌ల్టెంట్స్, పారిశ్రామిక‌వేత్త‌ల‌ను క‌లిశారు.

ఈ సంద‌ర్బంగా ఏపీలోని విశాఖ వేదిక‌గా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ బోయే ఈ సీఐఐ 2025 స‌ద‌స్సుకు రావాల్సిందిగా ఆహ్వానం ప‌లికారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. ఈ స‌మ్మిట్ ను ప్ర‌త్యేకంగా ఏపీ స‌ర్కార్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. రాష్ట్రానికి చెందిన మొత్తం మంత్రులంతా ఇక్క‌డే కొలువు తీరారు. దీనిని ఎలాగైనా స‌రే స‌క్సెస్ చేయాల‌ని కృత నిశ్చ‌యంతో ప‌ని చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో స‌ర్కార్ ఏకంగా 10 ల‌క్ష‌ల పెట్టుబ‌డులు రాబ‌ట్టాల‌ని భావిస్తోంది. ఈ మేర‌కు ఎంఓయూ (ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ఒప్పందం) చేసుకోవాల‌ని కృత నిశ్చ‌యంతో ఉంది.

  • Related Posts

    వైశాఖి వేడుక‌ల కోసం కేటీఆర్ కు ఆహ్వానం

    Spread the love

    Spread the loveరావాల‌ని కోరిన గురుద్వారా క‌మిటీహైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ – వైశాఖి వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గురుద్వారా ప్రతినిధులు…

    డీసిల్టింగ్ ప‌నుల తీరుపై వివ‌రాలు ఇవ్వండి

    Spread the love

    Spread the loveఆదేశించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని కృష్ణాన‌గ‌ర్‌, అమీర్‌పేట త‌దిత‌ర‌ డివిజ‌న్ల వారీ వాట్సాప్ గ్రూపులు పెట్టి డీసిల్టింగ్ ప‌నులు జ‌రుగుతున్న తీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం త‌మ‌కు ఇవ్వాల‌ని స్థానిక కాల‌నీ సంక్షేమ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *