చెరువుల‌తో పాటు నాలాల అభివృద్ది చేస్తాం

Spread the love

స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు చెరువులు, నాలాల‌పై . గొలుసుక‌ట్టు చెరువుల‌కు ప్రాణాధార‌మైన నాలాలను కూడా ప‌రిర‌క్షించు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. అప్ప‌డే న‌గ‌రంలో వ‌ర‌ద‌ల‌ను నివారించ‌గ‌ల‌మ‌ని చెప్పారు. చెరువుల ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ ఒక ఎక‌రం ప‌రిధిలో మీట‌రు లోతులో 4 మిలియ‌న్ లీట‌ర్ల నీటిని ఆప‌గ‌ల‌మ‌న్నారు. ఈ లెక్క‌న వ‌ర‌ద‌ల‌ను నివారించ‌డానికి చెరువులు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేద‌న్నారు ఏవీ రంగ‌నాథ్. ప్ర‌భుత్వ భూములు, చెరువుల‌, నాలాలు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను ప‌రిర‌క్షించ‌డంతో పాటు.. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోడానికి హైడ్రాను రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింద‌న్నారు.

ప్ర‌కృతిని మ‌నం కాపాడితే.. ప్ర‌కృతి వైప‌రీత్యాల నుంచి చాలా వ‌ర‌కు బ‌య‌ట ప‌డ‌గ‌ల‌మ‌న్నారు. న‌గ‌రంలో చెరువులు దాదాపు 61 శాతం క‌నుమ‌రుగ‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏవీ రంగ‌నాథ్. వాటిని వీలైనంత‌వ‌ర‌కు పున‌రుద్ధ‌రించేందుకు హైడ్రా కృషి చేస్తోంద‌ని చెప్పారు ఏవీ రంగ‌నాథ్. కార్పొరేట్ సంస్థ‌లు కూడా ఇందుకోసం ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. చెరువులు శాశ్వ‌త ఆస్తులుగా ప‌రిగ‌ణించి ముందు త‌రాల‌వారికి వాటిని భ‌ద్రంగా అప్ప‌జెప్పాల్సిన అవ‌స‌రాన్ని గుర్తు చేశారు. చెరువుల చెంత‌… పిల్ల‌లు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ఆడుకునేలా.. అక్క‌డ అన్ని వ‌య‌సుల వారు సేద‌దీరే విధంగా తీర్చిదిద్దాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఎస్ ఆర్ స‌మ్మిట్ ముఖ్య ఉద్దేశాల‌ను ఎమ్మెల్సీ ప్రొ. కోదండ‌రామ్ వివ‌రించారు. హైడ్రాకు త‌మవంతు స‌హ‌కారం అందిస్తామ‌ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఖైర‌తాబాద్ ఛైర్మ‌న్ ప్రొ . డా. ర‌మ‌ణ నాయ‌క్ తెలిపారు.

  • Related Posts

    జురిచ్ లో ఏపీ సీఎం చంద్ర‌బాబు బిజీ బిజీ

    Spread the love

    Spread the loveభార‌త రాయ‌బారి మృదుల్ కుమార్ తో భేటీ జురిచ్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స్విట్జర్లాండ్ లోని జురిచ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ఉత్పాదక సమావేశం జరిగింది.…

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    Spread the love

    Spread the loveప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *