చ‌ర్య‌లు తీసుకుంటావా లేక జైలులో ఉంటావా..?

Spread the love

స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ పై సీజేఐ ఆగ్ర‌హం

ఢిల్లీ : తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం. సోమ‌వారం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై విధించిన గ‌డువు పూర్తయినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదంటూ ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను మీరు ఉల్లంఘించిన‌ట్లు భావిస్తున్న‌ట్లు తెలిపారు. త‌ను న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఇంట్లో చేసుకుంటావా లేక జైలులో చేసుకుంటావా తేల్చుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది స్పీక‌ర్ కు. ఒక ర‌కంగా ఇవాళ చేసిన సీజేఐ చేసిన కామెంట్స్ చెంప పెట్టు అని చెప్ప‌దు. ఒక పార్టీపై గెలిచి అధికారం కోసం ఇత‌ర పార్టీలో చేరిన ఎమ్మెల్యేల‌కు క‌నీసం విలువ‌లు లేక పోవ‌డం ప‌ట్ల కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొంది.

కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు తాము భావించాల్సి వ‌స్తుంద‌ని, త‌ను జైలు శిక్ష అనుభ‌వించక త‌ప్ప‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు దాఖ‌లు చేసిన పిటిషన్ల‌తో పాటు స్పీక‌ర్ త‌ర‌పున దాఖ‌లు చేసిన దావాపై కూడా సోమ‌వారం సుదీర్ఘ విచార‌ణ చేప‌ట్టింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేకపోతే స్పీకర్ కోర్టు ధిక్కరణ చేసినట్లే అని హెచ్చరించారు. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని మేము ముందే చెప్పాం. ఫిరాయింపులను దాచిపెట్టి వ్యవస్థను ఎద్దేవా చేసే అవకాశం ఎవరికి లేదని కుండ బ‌ద్ద‌లు కొట్టారు సీజేఐ.

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

    Spread the love

    Spread the loveస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు.…

    మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    Spread the love

    Spread the loveప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్‌లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *