వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామ‌య్య‌

Spread the love

తెలంగాణ విద్యావేత్తకు అభినంద‌న‌ల వెల్లువ‌

హైద‌రాబాద్ : ఎంతో మందిని ఐఐటీయ‌న్లుగా మార్చిన తెలంగాణ‌కు చెందిన విద్యావేత్త రామ‌య్య ఇవాల్టితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శ‌త వసంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ చేస్తున్నారు ప్ర‌ముఖులు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అభినందించారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే మాజీ మంత్రి కేటీఆర్ స్వ‌యంగా ఐఐటీ రామ‌య్య ఇంటికి వెళ్లారు. సామాజిక ఉద్యమకారుడు చుక్కా రామయ్యకు 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

విద్యానగర్ లో ఉన్న‌ చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించారు. ఆయ‌న ఆరోగ్యం గురించి వాక‌బు చేశారు. ఆ దేవుడు మ‌రిన్ని ఏళ్లు బ‌తికేలా ఆశీర్వ‌దించాల‌ని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పూర్తి చేసి ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి కారణం చుక్కా రామయ్య అని కొనియాడారు. విద్యా ప్రదాత కాకుండా తెలంగాణ పోరాటంలో, రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్ర పోషించాడని కొనియాడారు. అలాంటి చుక్కా రామయ్య 100వ బర్త్ డే జరుపుకోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తి దాయకమని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ తో పాటు జూలూరి గౌరీశంక‌ర్ కూడా హాజ‌ర‌య్యారు. ఐఐటీ రామ‌య్య‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

Spread the love

Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

Spread the love

Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *