హనుమంత వాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారు

Spread the love

పట్టాభిరాముని అలంకారంలో ద‌ర్శ‌న భాగ్యం

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.

హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్య భక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలమేలుమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతున్ని వాహనంగా చేసుకుంది.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ వి. వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍

  • Related Posts

    శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఆల‌యాల్లో అన్న‌దానం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుప‌తి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు టీటీడీ ఆధ్వ‌ర్యంలోని అన్ని ఆల‌యాల‌లో నిరంత‌రం అన్న‌దానం…

    డిజిటలైజేషన్ దిశగా టిటిడి విద్యా సంస్థలు

    Spread the love

    Spread the loveవిద్యార్థులకు అదనంగా 1080 మందికి హాస్టల్ సీట్లు తిరుపతి : టీటీడీ విద్యా సంస్థ‌ల‌పై ఫోక‌స్ పెట్టారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ పై సమీక్ష నిర్వహించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *