రేవంత్ రెడ్డితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

Spread the love

ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిసిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి వివరించారు . ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై మోహన్ యాదవ్ కి వివరించారు. అంతే కాకుండా దేశంలో ఎక్క‌డా లేని విధంగా, ఏ రాష్ట్రం అమ‌లు చేయ‌ని విధంగా తాము వ‌చ్చాక స‌న్న బియ్యాన్ని పేద‌ల‌కు పంపిణీ చేస్తున్నామ‌న్నారు.

ఇదే స‌మ‌యంలో తాజాగా రాష్ట్రంలో ప‌ర్య‌టించిన కేంద్ర ఆహార , పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి సైతం తాము అమ‌లు చేస్తున్న స‌న్న బియ్యం ప‌థ‌కాన్ని ప్ర‌శంసించార‌ని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప‌థ‌కాన్ని దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల‌లో అమ‌లు చేయాల‌ని తాము సూచించామ‌ని, ఇందుకు ఆయ‌న స‌మ్మ‌తించార‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే అధికారికంగా ఢిల్లీలో స‌మావేశం కూడా ఏర్పాటు చేస్తామ‌న్నార‌ని చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంతో క‌ల‌వ‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు రేవంత్ రెడ్డి.

  • Related Posts

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    Spread the love

    Spread the loveప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి…

    కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveపాలేరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి షాకింగ్ కామెంట్స్ ఖ‌మ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *