సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ

Spread the love

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా : అన్నార్థుల‌, విద్యార్థుల ఆక‌లిని తీర్చుతోంది అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దానం చేస్తోంది. ప్ర‌భుత్వంతో క‌లిసి ఒప్పందం చేసుకుంది. ప‌లు చోట్ల సెంట్ర‌లైజ్డ్ క‌మ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు సీఎం. ఈ సంద‌ర్బంగా నిర్వహించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ ( సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. రాబోయే రోజుల్లో కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దుతాన‌ని ప్ర‌క‌టించారు. రూ. 103 కోట్ల విఇలువ చేసే అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, భూమి పూజ చేయ‌డం మంత్రుల‌తో క‌లిసి ఆనందంగా ఉంద‌న్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నోయిడాగా కోడంగ‌ల్ ను తీర్చుతాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి. ల‌క్ష‌లాది మందికి ఇది ఆక‌లిని తీర్చ‌డం ఖాయ‌మ‌న్నారు. రైల్వే ప్రాజెక్టు ప‌నులు కూడా ప్రారంభం అవుతాయ‌ని అన్నారు.

  • Related Posts

    సీఎం రేవంత్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప‌దే ప‌దే అబ‌ద్దాలు…

    ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న జ‌గ‌న్ : ర‌వికుమార్

    Spread the love

    Spread the loveమాజీ ముఖ్య‌మంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, ప‌ల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి ర‌వికుమార్. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని, లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *