సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా : అన్నార్థుల‌, విద్యార్థుల ఆక‌లిని తీర్చుతోంది అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దానం చేస్తోంది. ప్ర‌భుత్వంతో క‌లిసి ఒప్పందం చేసుకుంది. ప‌లు చోట్ల సెంట్ర‌లైజ్డ్ క‌మ్యూనిటీ కిచెన్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు సీఎం. ఈ సంద‌ర్బంగా నిర్వహించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ ( సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్) భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌మావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. రాబోయే రోజుల్లో కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని రోల్ మోడ‌ల్ గా తీర్చిదిద్దుతాన‌ని ప్ర‌క‌టించారు. రూ. 103 కోట్ల విఇలువ చేసే అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, భూమి పూజ చేయ‌డం మంత్రుల‌తో క‌లిసి ఆనందంగా ఉంద‌న్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నోయిడాగా కోడంగ‌ల్ ను తీర్చుతాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి. ల‌క్ష‌లాది మందికి ఇది ఆక‌లిని తీర్చ‌డం ఖాయ‌మ‌న్నారు. రైల్వే ప్రాజెక్టు ప‌నులు కూడా ప్రారంభం అవుతాయ‌ని అన్నారు.

  • Related Posts

    ఉద్యోగుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట : సీఎం

    హైద‌రాబాద్ : త‌మ ప్ర‌భుత్వం ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం కోసం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం కీలక మైలు రాయిని సాధించింది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమగ్ర ఆరోగ్య భద్రత ,…

    మ‌త‌ప‌ర‌మైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు

    హైదరాబాద్ : మత పరమైన అంశాలకు సంబంధించిన హోంవర్క్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి బంధువు సుప్రియ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో ఆమె తీవ్రంగా స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న మా మేనల్లుడిని తీసుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *