క్రికెట్ రంగంలో మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఐసీసీ చైర్మ‌న్ జే షా

ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ , ఏసీసీ చైర్మ‌న్ జే షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో రోజు రోజుకు క్రికెట్ ఆట అనేది విడ‌దీయ‌రాని బంధంగా పెన‌వేసుకు పోయింద‌న్నారు. ప్రతి ఒక్కరూ తమ కొడుకు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ , సంజూ శాంస‌న్ లాగా మారాలని కోరుకుంటార‌ని అన్నారు. కానీ ఎవరూ తమ కుమార్తె హర్మన్‌ప్రీత్ లేదా స్మృతి మంద‌న్నా లాగా మారాలని కోరుకోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఆదివారం జే షా ఓ మీడియా ఛాన‌ల్ తో సంభాషించారు. ఈ మేర‌కు క్రికెట్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో మహిళా క్రికెట్ రంగంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు జే షా.

క్రికెట్ రంగంలో పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌ల‌కు కూడా అవ‌కాశాలు క‌ల్పించాల‌ని తాము నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా వారికి భారీ ఎత్తున గౌర‌వ వేత‌నాలు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బీసీసీఐ అందిస్తున్న ప్రోత్సాహం , వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం వ‌ల్ల వారికి ఆట ప‌రంగానే కాదు స‌మాజంలో కూడా కీల‌క‌మైన గుర్తింపు, గౌర‌వం ల‌భించింద‌ని చెప్పారు జే షా. దీని కార‌ణంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మహిళా క్రికెట్ జ‌ట్టు సుదీర్ఘ కాలం త‌ర్వాత వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకుంద‌ని, ఇదంతా తాము అందించిన సంపూర్ణ స‌హ‌కారం, హెడ్ కోచ్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని చెప్పారు.

  • Related Posts

    త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లోనే మ్యాచ్ లు ఆడుతాం

    Spread the love

    Spread the loveఐసీసీకి స్ప‌ష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా తాము ఇండియాలో జ‌రిగే కీల‌క మ్యాచ్ ల‌ను…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 బ‌రువు 6,175 కిలోలు

    Spread the love

    Spread the love18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ త‌యారీ న్యూఢిల్లీ : అమెరికా వేదిక‌గా ఈ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్స‌ర్ చేస్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *