తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఏర్పాట్లు సూప‌ర్

ప్ర‌శంసించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ స‌మ్మిట్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని ఎంపిక చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన 5 వేల మందికి పైగా ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు ఈ స‌మ్మిట్ కు. సోమ‌వారం గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. రెండో సెష‌న్ లో తెలంగాణ భ‌విష్య‌త్తు, ప్ర‌ణాళిక‌లు, త‌మ స‌ర్కార్ విజ‌న్ ఏమిటో చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి. రూ. 100 కోట్ల‌కు పైగా ప్ర‌జా ధ‌నంతో దీనిని ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం.

ప్రభుత్వ శాఖలు, కార్పోరేషన్లకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంద‌ర్బంగా చెప్పారు రాష్ట్ర రెవిన్యూ , సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ముఖ్యంగా అనేక దేశాల నుంచి ప్రముఖులు, ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాట్లు చేశామ‌న్నారు. డిసెంబర్ 8 మధ్యాహ్నం అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభవుతాయ‌ని, డిసెంబర్ 9న మంగ‌ళావ‌రం సాయంత్రం ముగుస్తాయన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ వల్ల తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటడం ఖాయం అని ధీమా వ్య‌క్తం చేశారు .

  • Related Posts

    భోగాపురం ఎయిర్ పోర్టులో విమానాలు స్టార్ట్

    అమ‌రావ‌తి : ఏపీలోని ఇటీవ‌లే ప్ర‌ధాని మోదీ ప్రారంభించిన భోగాపురం ఎయిర్ పోర్టులో సోమ‌వారం నుచి వాణిజ్య విమానాల రాక పోక‌లు ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది…

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *