ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

కేంద్ర స‌ర్కార్ పై సంచ‌ల‌న కామెంట్స్

ఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఓట్ చోరీకి వ్య‌తిరేకంగా భారీ ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టింది. దేశ వ్యాప్తంగా కీల‌క‌మైన నేత‌లు, ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. ఆయ‌న మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో తొలుత ఓటరు కార్డు తొలగిస్తారని, ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డ్ రద్దు చేస్తారని హెచ్చ‌రించారు. ఆ తర్వాత వాళ్లకున్న హక్కులన్నీ గుంజుకుంటారని ఆరోపించారు సీఎం. ఈ సమస్య ఎన్నికలదో.. కాంగ్రెస్ పార్టీదో కాదు దేశ సమస్య అని గుర్తించాల‌ని పేర్కొన్నారు.

ఈ సమస్యకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసే పోరాటంలో కలిసి సాగేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. దేశ ప్రజలంతా కలిసి రావాలని ఆయ‌న పిలుపునిచ్చారు. ఇవాళ దేశంలో ప్ర‌జాస్వామ్యం అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిలో ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఆర్ఎస్ఎస్, గోల్వాల్క‌ర్ సిద్దాంతానికి వ్య‌తిరేకంగా పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. లేక‌పోతే మ‌నం మనం కాకుండా పోతామ‌ని పేర్కొన్నారు. జాతీయ స‌మ‌స్య‌గా ఓట్ చోరీ మారింద‌ని, దీనిపై రాహుల్ గాంధీ ఒక్క‌డే పోరాడుతున్నాడ‌ని, ఆయ‌న‌కు మ‌నంద‌రం మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కోరారు సీఎం.

  • Related Posts

    సీఎం చంద్ర‌బాబు రాక కోసం భారీ ఏర్పాట్లు

    Spread the love

    Spread the loveప‌రిశీలించిన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తిరుప‌తి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తిరుప‌తి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఏర్పాట్లను ప‌రిశీలించారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు.…

    సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డిపై ఫోక‌స్ : డీజీపీ

    Spread the love

    Spread the loveతెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంద‌ర్శ‌న హైద‌రాబాద్ : శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి. సైబర్ భద్రత, సైబర్ నేరాల అమలులో కొనసాగుతున్న చొరవలను సమీక్షించడానికి తెలంగాణ డీజీపీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *