న‌టి మాధ‌వీల‌త‌కు షాక్ కేసు న‌మోదు

Spread the love

సాయిబాబ‌పై అనుచిత వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ : సినీ న‌టి, బీజేపీ అనుకూల కామెంట్స్ చేస్తూ రీల్స్, వీడియోల పై ఫోక‌స్ పెట్టింది మాధ‌వీల‌త‌. త‌ను తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది షిర్డీ సాయిబాబా గురించి. చివ‌ర‌కు ఆమె చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. భ‌క్తుల మ‌నో భావాలు దెబ్బ‌తిన్నాయి. సాయి బాబా దేవుడు కానే కాదని పేర్కొంది. త‌న‌ను ఎందుకు కొలుస్తున్నారంటూ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. దీంతో సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ న‌టి మాధ‌వీల‌త‌పై సాయి బాబా సంస్థాన్ ఫిర్యాదు చేసింది.

ఆమెతో పాటు మ‌రికొంద‌రు యూట్యూబ‌ర్ల‌పై కూడా ఫిర్యాదు చేయ‌డంతో హైద‌రాబ‌ద్ లోని స‌రూర్ న‌గ‌ర్ పోలీసులు షాక్ ఇచ్చారు. వీరంద‌రిపై కేసు న‌మోదు చేశారు. ఈ సంద‌ర్బంగా డిసెంబ‌ర్ 30వ తేదీ మంగ‌ళ‌వారం రోజు త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు నోటీసులు జారీ చేశారు. విచార‌ణ నిమిత్తం స‌రూర్ పోలీస్ స్టేష‌న్ కు ఉద‌యం 10 గంట‌ల‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఈ మ‌ధ్య‌న ఫ్యాష‌న్ అయి పోయింది. ప్ర‌తి ఒక్క‌రికీ కామెంట్స్ చేయ‌డం, పాపుల‌ర్ కావ‌డం, ఇత‌రుల‌ను ఇబ్బంది పెట్ట‌డం.

  • Related Posts

    భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా

    Spread the love

    Spread the loveఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మ‌రోసారి…

    మార్కెట్ మోసానికి గురైన డైరెక్ట‌ర్ కొడుకు

    Spread the love

    Spread the loveరూ. 63 ల‌క్ష‌లు కోల్పోయానంటూ ఫిర్యాదు హైద‌రాబాద్ : సైబ‌ర్ వ‌ల‌లో ప‌లువురు ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు న‌ష్ట పోతున్నారు. క‌ష్ట‌ప‌డిన వారంతా అత్యాస‌కు గురై డ‌బ్బుల‌ను కోల్పోతున్నారు. నిన్న మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భార్య ఏకంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *