జ‌ల‌మండ‌లి భూమిని కాపాడిన హైడ్రా

Spread the love

రాంపూర్‌లో 4 ఎక‌రాల చుట్టూ ఫెన్సింగ్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. భూ ఆక్ర‌మ‌ణ‌దారులు, క‌బ్జ‌దారుల‌కు చెక్ పెడుతోంది. ప్ర‌తి సోమవారం హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున బాధితులు పోటెత్తారు. భారీగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలీంచిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో హైడ్రా సిబ్బంది పెద్ద ఎత్తున ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. ఇందులో భాగంగా తాజాగా భారీ ఎత్తున ఆక్ర‌మ‌ణ‌కు గురైన ప్ర‌భుత్వ భూమిని గుర్తించారు. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కీస‌ర మండ‌లం రాంప‌ల్లి విలేజ్ స‌ర్వే నంబ‌రు 388లో జ‌ల‌మండ‌లికి (HMWSSB)కి చెందిన 4.01 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది.

జ‌ల‌మండ‌లి అవ‌స‌రాల మేర‌కు ఇక్క‌డ భూమిని కేటాయించింది గ‌తంలో స‌ర్కార్. దానిని స్వాధీనం చేసుకోవ‌డంలో స్థానికులు ఇబ్బందులు పెట్టారు. ఆక్ర‌మ‌ణ‌దారులు వారిని బెదిరింపుల‌కు గురి చేశారు. ప్ర‌హ‌రీ నిర్మాణాన్నిఅడ్డుకుని ఆటంకాలు సృష్టించారు. దీంతో హైడ్రా స‌హాయాన్ని జ‌ల‌మండ‌లి కోరింది. సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి జ‌ల‌మండ‌లికి ప్ర‌భుత్వం కేటాయించిన‌ట్టు హైడ్రా నిర్ధారించుకుంది. ఈ మేర‌కు 4.01 ఎక‌రాల జ‌ల‌మండ‌లికి చెందిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. జ‌ల‌మండ‌లికి చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది.

  • Related Posts

    ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు : రాజ్ థాక్రే

    Spread the love

    Spread the loveమ‌రాఠా స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు మ‌హారాష్ట్ర : మ‌హారాష్ట్ర‌ న‌వ నిర్మాణ సేన పార్టీ అధ్య‌క్షుడు రాజ్ థాక్రే నిప్పులు చెరిగారు. ఆయ‌న తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో…

    ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేత

    Spread the love

    Spread the loveఅమెరికాతో తీవ్ర ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఇరాన్ : ఇరాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా ఇరాన్ పై తీవ్ర ఆంక్ష‌లు ప్ర‌క‌టించ‌డంతో పాటు ఏకంగా యుద్దానికి సిద్దం అవుతున్న‌ట్లు ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *