నిప్పులు చెరిగిన టీపీసీసీ అధ్యక్షుడు
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భగ్గుమన్నారు. నీకు అంత సీన్ లేదన్నారు. ఇక్కడ ఏం పని ఉందని తెలంగాణలో ప్రచారం చేసేందుకు వస్తాడంటూ ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే ఎవరూ ఊరుకోరని అన్నారు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఎన్నో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మాటలు వినే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరని స్పష్టం చేశారు. తమ ఆత్మ గౌరవంకు భంగం కలగించేలా ఎవరు మాట్లాడినా లేదా ప్రయత్నం చేసినా అడ్డుకుని తీరుతారని అన్నారు.
భిక్షాందేహి అని పవన్ కళ్యాణ్ను అడుక్కునే దీన స్థితిలో తెలంగాణ బీజేపీ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. కులం, మతం పేరిట బీజేపీ మోసం చేయాలని చూసినా తెలంగాణ ప్రజలు మోసపోయేందుకు సిద్దంగా లేరన్నారు . పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసుకోవాలంటే ఆంధ్రాలో చేసుకో.. తెలంగాణలో కాదు అని హితవు పలికారు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.





