జర్నలిస్ట్ రేవతి కేసులో సీరియస్ కామెంట్స్
ఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సీరియస్ కామెంట్స్ చేసింది. మహిళా జర్నలిస్ట్ రేవతి పట్ల తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా తెలంగాణ కేంద్రంగా నడస్తున్న పల్స్ న్యూస్ జర్నలిస్ట్ రేవతిని గతంలో ఒక న్యూస్ విషయంలో గతేడాది మార్చి నెలలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆతర్వాత బెయిల్ పై రేవతి విడుదలైంది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ ఖాకీలు రూల్స్ ను అతిక్రమిస్తూ రేవతిని తమ కస్టడీకి ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్బంగా విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. బెయిల్ పై విడుదలైన ఆరు నెలల తర్వాత , పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. ఇదంతా చూస్తుంటే కక్ష సాధింపు తప్పా మరోటి కాదని తేలుతోందని వ్యాఖ్యానించింది.
పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. అయితే చట్ట ప్రకారం..ఏదైనా కేసులో బెయిల్ మంజూరు అయ్యాక పోలీస్ కస్టడి సాధ్యం కాదని స్పష్ట చేసింది. పదేళ్ల శిక్ష పడే కేసులలో బెయిల్ వచ్చిన 45 రోజులలోపు మాత్రమే పోలీసు కస్టడికి అనుమతి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల తర్వాత పోలీస్ కస్టడీ అడగడం ఒక విపరీతమైన నిర్ణయంగా పేర్కొంది సుప్రీం కోర్టు ధర్మాసనం. ఈ కేసులో జర్నలిస్ట్ రేవతి పోలీస్ కస్టడి అప్పీల్ ను నిరాకరించడమే కాకుండా…ఇక మీద కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలంగాణ ఖాకీలను ధర్మాసనం హెచ్చరించింది.





