ఉత్త‌రాంధ్ర కాలుష్యంపై విచార‌ణ జ‌రిపించాలి

Spread the love

డిమాండ్ చేసిన బొలిశెట్టి స‌త్య నారాయ‌ణ

విశాఖ‌ప‌ట్నం : జ‌న‌సేన సీనియ‌ర్ నాయ‌కులు బొలిశెట్టి స‌త్య నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
రూ. 1,00,000 కోట్ల పర్యావరణ నష్టానికి కారణమైన వారిని శిక్షించేందుకు స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయ‌న డిమాండ్ చేశారు . ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్న కాలుష్యంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ, పాత నివేదికలనే “కట్ అండ్ పేస్ట్” చేస్తూ GVMC, APPCB అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. శుద్ధి చేయని మురుగు నీరు సముద్రాన్ని నిరంతరం కలుషితం చేస్తూనే ఉందన్నారు.

గత 10 ఏళ్లుగా జరిగిన పర్యావరణ నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వేతర నిపుణులతో (Non-Government Experts) ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మేధావులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించిన దాఖ‌లాలు లేవ‌న్నారు బొలిశెట్టి స‌త్య నారాయ‌ణ‌. ​APPCB , GVMC ల నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం అక్షరాలా లక్ష‌ కోట్లకు పైమాటేనని నిపుణుల అంచనా వేశార‌ని తెలిపారు. కాలుష్యం చేసిన వారే నష్ట పరిహారం చెల్లించాలనే (Polluter Pays Principle) సుప్రీం కోర్టు నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    విద్యార్థి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ కేసులో 12 మంది అరెస్ట్

    Spread the love

    Spread the loveకీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన డీఎస్పీ చల‌సాని, సీఐ పెన‌మ‌లూరు : రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన పోరంకి లోని శ్రీ చైత‌న్య కాలేజీలో చ‌దువుతున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ కేసులో కీల‌క మ‌లుపు తిరిగింది. స‌హ‌చ‌ర విద్యార్థులు త‌న‌పై…

    మ‌దిర‌తో ఎన్నో జ‌న్మ‌ల బంధం : భ‌ట్టి విక్ర‌మార్క‌

    Spread the love

    Spread the loveన‌న్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్ ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేప‌ట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *