విద్యార్థి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ కేసులో 12 మంది అరెస్ట్

కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన డీఎస్పీ చల‌సాని, సీఐ

పెన‌మ‌లూరు : రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన పోరంకి లోని శ్రీ చైత‌న్య కాలేజీలో చ‌దువుతున్న మొల్లి ప‌వ‌న్ కుమార్ సూసైడ్ కేసులో కీల‌క మ‌లుపు తిరిగింది. స‌హ‌చ‌ర విద్యార్థులు త‌న‌పై దాడి చేయ‌డం, అందుకు సంబంధించిన వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైర‌ల్ గా మార‌డంతో త‌ట్టుకోలేక పోయాడు ప‌వ‌న్ కుమార్. చివ‌ర‌కు సూసైడ్ చేసుకున్నాడు. అంతే కాదు త‌న‌ను దారుణంగా కొట్టిన వారి పేర్ల‌ను మృతుడు చేతిపై రాసుకున్నాడ‌ని, ఈ పేర్ల‌ను బ‌య‌ట‌కు రాకుండా శ్రీ చైత‌న్య కాలేజీ యాజ‌మాన్యం సాక్ష్యాల‌ను ధ్వంసం చేసింద‌ని డీఎస్పీ చ‌ల‌సాని, సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ‌లు వెల్ల‌డించారు. ఆదివారం మీడియాతో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన కేసు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

మృతుడి స్వ‌స్థ‌లం బుచ్చ‌య్య‌పేట మండ‌లం లింగ‌భూపాల‌పుర అగ్ర‌హారం. త‌న వ‌య‌సు 17 ఏళ్లు. శ్రీ చైత‌న్య కాలేజీలో ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. చ‌దువుకుంటున్న స‌మ‌యంలో హేమంత్ అనే తోటి స్టూడెంట్ తో గొడ‌వ జ‌రిగింది. ఇద్ద‌రూ దూరంగా ఉంటున్నారు. హేమంత్ తో మాట్లాడ వ‌ద్దంటూ ప‌వ‌న్ కుమార్ తోటి విద్యార్తుల‌కు సూచించాడ‌ని, దీనిని గ‌మ‌నించిన హేమంత్ మిగ‌తా స్టూడెంట్స్ తో క‌లిసి గ‌త జ‌న‌వ‌రి 5వ తేదీన రాత్రి 11 గంట‌ల‌కు ప‌వ‌న్ కుమార్ ను గ‌దికి పిలిపించారు. దారుణంగా దాడికి పాల్ప‌డ్డారు. ఈ దృశ్యాల‌ను వీడియో తీశారు. ఆపై ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. అది వైర‌ల్ అయ్యింది. దీనిని త‌ట్టుకోలేక పోయాడు ప‌వ‌న్ కుమార్. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

త‌న‌ను కొట్టిన వారి పేర్ల‌ను త‌న చేతిపై రాసుకున్నాడు. దీనిని ప్రిన్సిప‌ల్ సూచ‌న‌ల మేర‌కు ఫ్లోర్ ఇన్ ఛార్జి ర‌వీంద్ర‌, మెస్ నిర్వాహ‌కులు హేమంత్, రాజేష్ , జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్లు ఆనంద్, కృష్ణ ఆ పేర్ల‌ను తుడిచి వేశార‌ని పోలీసులు వెల్ల‌డించారు. త‌మ‌కు తెలియ‌కుండానే ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ తో పాటు పేర్ల‌ను తుడిచి వేసిన వారితో పాటు దాడికి పాల్ప‌డిన వారిని మొత్తం 12 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు డీఎస్పీ, సీఐలు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *