కీలక వ్యాఖ్యలు చేసిన కిరణ్ మజుందార్ -షా
న్యూఢిల్లీ : బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందర్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బయోలాజికల్ సిస్టమ్లు డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెంటర్ల వలె పనిచేస్తాయని, గిగావాట్-శక్తితో పనిచేసే ఏఐ సిస్టమ్లతో పోలిస్తే కనీస శక్తితో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయని ఆమె గుర్తించారు . బయోలాజికల్ ఇంటెలిజెన్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కలయిక వైద్యంలో ఒక నమూనా మార్పుకు దారి తీస్తుందని అన్నారు. ప్రిడిక్టివ్ హెల్త్కేర్, పునరుత్పత్తి శాస్త్రం, జీవితకాల నిర్వహణలో పురోగతులను అనుమతిస్తుందని చెప్పారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్ లో ఆమె పాల్గొన్నారు. .జీవశాస్త్రం లోతైన అంతర్దృష్టులను ఉత్పత్తి చేయడంలో పరిమితం గా ఉందన్నారు. కానీ AI సాధనాలు జీవన వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి అపరిమితమైన అవకాశాలను తెరుస్తున్నాయని అన్నారు.
జీవ వ్యవస్థలు డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెంటర్ల వలె పని చేస్తాయని, గిగావాట్-శక్తితో పనిచేసే AI సిస్టమ్లతో పోలిస్తే కనీస శక్తితో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయని గుర్తించడం జరిగిందన్నారు. తక్కువ శక్తితో దీన్ని ఎలా చేయాలో, వేగంగా ఎలా చేయాలో , మల్టీమోడల్ డేటాను చాలా త్వరగా ఎలా మల్టీప్లెక్స్ చేయాలో జీవశాస్త్రం AIకి నేర్పించడానికి చాలా ఉందని అన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ కణాలను ప్రాణాంతకం కానివిగా మార్చడం వంటి కణాలను రీప్రొగ్రామింగ్ చేయడం వైద్యం ‘హోలీ గ్రెయిల్’గా మజుందార్-షా అభివర్ణించారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ కూడా పాల్గొని ప్రసంగించారు.





