క‌డియం శ్రీ‌హ‌రి కామెంట్స్ రాజ‌య్య స్ట్రాంగ్ కౌంట‌ర్

కేసీఆర్ ను చూస్తే నీకు లాగు త‌డిచి పోతుంది

వ‌రంగ‌ల్ జిల్లా : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి పై భ‌గ్గుమ‌న్నారు. తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే నీకు త‌మ నాయ‌కుడు, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు. శుక్ర‌వారం తాటికొండ రాజ‌య్య మీడియాతో మాట్లాడారు. ఇలాంటి నీతిత‌ప్పిన మాట‌లు మాట్లాడ‌టం బంద్ చేయాల‌ని సూచించారు. కేసీఆర్ ని బయటకి రా అంటున్నావు..ఆయనను చూస్తేనే నీ లాగు తడుస్తదంటూ ఎద్దేవా చేశారు . త‌ను చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు. ఒక స్థాయి నాయ‌కుడు మాట్లాడాల్సిన మాట‌లు ఇవి కావ‌న్నారు.

కాళేశ్వరం వర ప్రదాయిని అని ఆనాడు చెప్పి, ఈరోజు కూలేశ్వరం అనడానికి నోరు ఎలా వస్తుంది కడియం శ్రీహరి? అంటూ నిప్పులు చెరిగారు తాటికొండ రాజ‌య్య‌. 2009, 2011 నా చేతిలో చిత్తుగా ఓడిపోయిన కడియం శ్రీహరి కేసీఆర్ దయ వల్ల ఎన్నో పదవులు అనుభవించాడ‌ని ఆవిష‌యం మ‌రిచి పోతే ఎలా అని నిల‌దీశారు. కాంగ్రెస్ కాసులకు అమ్ముడుపోయి, బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారిన నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావా? అంటూ భ‌గ్గుమ‌న్నారు రాజ‌య్య‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *