జ‌గ‌న్ డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు న‌డ‌వ‌వు

Spread the love

నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత

హైద‌రాబాద్ : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. అసెంబ్లీ, శాస‌న మండ‌లి స‌జావుగా జ‌ర‌గ‌కుండా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. జ‌గ‌న్ రెడ్డి ఇంకా అధికారంలోనే ఉన్నాన‌ని భ్ర‌మ‌ల్లో ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. చిల్ల‌ర రాజ‌కీయాల‌కు ఇది వేదిక కాద‌ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

ప్రజా సమస్యలపై చర్చించకుండా, తమ తప్పులు బయట పడకుండా వైసీపీ సభ్యులు ఎంతటి నీచానికైనా దిగజారి పోతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎస్. స‌విత‌. సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం బయటకు రావడంతో జగన్, వైసీపీ సభ్యులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ప్రజలు ఎప్పుడో వారిని పట్టించు కోవడం మానేశారని అన్నారు. 33 ఏళ్ల నుంచి హెరిటేజ్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని వ్యాపార ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తోందన్నారు. హెరిటేజ్ కు, టీటీడీకి ఎటువంటి సంబంధమూ లేదని మంత్రి సవిత స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    ఆంటోనియో గుటెర్రెస్ తో పీఎం భేటీ

    Spread the love

    Spread the loveప్ర‌పంచాన్ని శాసిస్తున్న ఏఐ పై చ‌ర్చ న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌రిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ ఏఐ స‌మ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఇరువురి…

    హెల్త్ కేర్ పై ఏఐ ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉంటుంది

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన కిర‌ణ్ మ‌జుందార్ -షా న్యూఢిల్లీ : బ‌యోకాన్ చైర్ ప‌ర్స‌న్ కిర‌ణ్ మ‌జుంద‌ర్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బయోలాజికల్ సిస్టమ్‌లు డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెంటర్‌ల వలె పనిచేస్తాయని, గిగావాట్-శక్తితో పనిచేసే ఏఐ సిస్టమ్‌లతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *