ర‌ష్మిక మంద‌న్నా మ‌జాకా

సోష‌ల్ మీడియాలో వైర‌ల్

హైద‌రాబాద్ : ఎట్ట‌కేల‌కు ఒక్క‌ట‌య్యారు న‌టీ న‌టులు ర‌ష్మిక మంద‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ ఇద్ద‌రూ గ‌త కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఎవ‌రికి వారు సినిమాల‌లో న‌టిస్తూనే ఫుల్ ఎంజాయ్ చేశారు. వీరు ఎక్క‌డికి వెళ్లినా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మార‌డంతో అంద‌రి దృష్టి వీరిద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్నారా లేదా అని ఉత్కంఠ‌కు గుర‌య్యారు. వీరి టెన్ష‌న్ కు చెక్ పెడుతూ ర‌ష్మిక మంద‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌లు అంద‌రి స‌మ‌క్షంలో ఒక‌రినొక‌రు పెళ్లి చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రికి సంబంధించిన పెళ్లి వేడుక‌ల ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి.

నేష‌న‌ల్ క్ర‌ష్ గా పేరు పొందిన ర‌ష్మిక మంద‌న్నా స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క‌. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ స్వ‌స్థలం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనిది. ఈ ఇద్ద‌రూ తొలిసారిగా మూవీస్ లో తార‌స ప‌డ్డారు. ఇద్ద‌రూ క‌లిసి రెండు సినిమాల‌లో న‌టించారు. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తీసిన గీత గోవిందం మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇందులో ఇద్ద‌రూ పోటీ ప‌డి న‌టించారు. ఒక ర‌కంగా లీన‌మై పోవ‌డంతో మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ సినిమా షూటింగ్ లోనే ర‌ష్మిక మంద‌న్నా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌లు పీక‌ల లోతు ప్రేమ‌లో కూరుకు పోయిన‌ట్లు టాక్. అయితే అంత‌కు ముందు ర‌ష్మిక ర‌క్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ ఎందుక‌నో త‌న‌ను వ‌ద్ద‌నుకుంది. ఇప్పుడు విజ‌య్ పంచ‌న చేరింది.

  • Related Posts

    రూ. 40 కోట్ల‌కు చేరువ‌గా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ

    హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని , అందాల తార భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి న‌టించిన తాజా చిత్రం లెనిన్ దుమ్ము రేపుతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూలై 10న శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా…

    ప‌ట్టుద‌ల‌తో న‌టిగా ప్రూవ్ చేసుకున్న భాగ్య‌శ్రీ భోర్సే

    హైద‌రాబాద్ : ముంబైకి చెందిన భాగ్య‌శ్రీ బోర్సే ఎట్ట‌కేల‌కు త‌ను న‌టిగా ప్రూవ్ చేసుకున్నారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తో ఆశించిన స‌క్సెస్ రాక పోయినా ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల‌లో న‌టించినా జ‌నం ఆద‌రించ‌లేదు. కానీ తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్, సితార…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *