ఇంగ్లండ్ రాణిస్తుందా ఇండియా గెలుస్తాందా

Spread the love

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2వ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ నేడు

ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు భార‌త జ‌ట్టుపైనే ఉన్నాయి. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకునేందుకు ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. ఫైన‌ల్ కు చేరాలంటే సిస‌లైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో స‌త్తా చాటాల్సి ఉంటుంది సూర్య భాయ్ సేన‌. ఇప్ప‌టికే బ్యాటింగ్ ప‌రంగా బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ బౌలింగ్ కొంత ఇబ్బంది పెడుతోంది. గౌతం గంభీర్ కోచ్ గా ఉన్న జ‌ట్టు ఇప్పుడు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ద‌మైంది. కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ లో వెస్టిండీస్ భారీ స్కోర్ ను ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది టీమిండియా.

కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించాడు. విండీస్ ఆట‌గాళ్ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు. త‌ను ఒక్క‌డే 97 ర‌న్స్ చేశాడు. అత్యంత బాధ్యతాయుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఇండియాను సెమీ ఫైన‌ల్ కు చేర్చ‌డంలో కీల‌క భూమిక పోషించాడు. మ‌రో వైపు అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్ , ఇషాన్ కిష‌న్ , హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ లు కీ రోల్ పోషించాల్సి ఉంది. మ‌రో వైపు ఎలాగైనా ఇండియాను ఓడించి ఫైన‌ల్ కు చేరుకోవాల‌ని ఇంగ్లండ్ ప్లాన్ వేస్తోంది. మ‌రో వైపు కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన తొలి సెమీస్ లో ఊహించ‌ని రీతిలో ద‌క్షిణాఫ్రికా ను మట్టి క‌రిపించింది. 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

  • Related Posts

    ఫిన్ అలెన్ విధ్వంసం దక్షిణాఫ్రికా ప‌రాజ‌యం

    Spread the love

    Spread the loveఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన కీవీస్ బ్యాట‌ర్ కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు న‌మోదు చేశాడు న్యూజిలాండ్ కు చెందిన క్రికెట‌ర్ ఫిన్ అలెన్. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్…

    వాంఖ‌డే స్టేడియంలో చెమటోడ్చుతున్న క్రికెట‌ర్లు

    Spread the love

    Spread the loveరేపే కీల‌క‌మైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఇంగ్లండ్ తో ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. క‌ప్ కైవ‌సం చేసుకునేందుకు టీమిండియాకు కేవ‌లం రెండే రెండు అడుగుల దూరంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *