రేవంత్ రెడ్డి జేజెమ్మ దిగి వచ్చినా మళ్లీ గెలవ‌డు

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఈట‌ల రాజేంద‌ర్

నిజామాబాద్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న గాడి త‌ప్పంద‌న్నారు. అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌ని మండిప‌డ్డారు. పేద‌లు, బ‌హుజ‌నుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆరు నూరైనా ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్ర‌ల‌కు తెర లేపినా, ఎన్ని మోస‌పూరిత‌మైన హామీలు ఇచ్చినా ఈసారి జ‌నం కాంగ్రెస్ పార్టీని న‌మ్మ‌ర‌ని అన్నారు. త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. అంతే కాదు సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి గెల‌వ‌డ‌ని జోష్యం చెప్పారు ఈట‌ల రాజేంద‌ర్. రాష్ట్రంలో క‌మ‌లం గాలి వీస్తోంద‌ని చెప్పారు.

న‌రేంద్ర మోదీ స‌మ‌ర్త‌వంత‌మైన నాయ‌క‌త్వం ప్ర‌పంచాన్ని సైతం నివ్వెర పోయేలా చేస్తోంద‌ని అన్నారు .
పీఎంను పార్టీలకు అతీతంగా దేశ ప్రజలంతా అభిమానిస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలు కులాలు, మతాలు ప్రాంతాలకు అతీతంగా ‘మా ప్రధాని’ అనుకునే అరుదైన గౌరవం ఒక్క నరేంద్ర మోదీకి మాత్రమే దక్కిందన్నారు. కౌన్సిల‌ర్లుగా, స‌ర్పంచులుగా, వార్డు మెంబ‌ర్లుగా గెలుపొందిన వారంద‌రికీ పేరు పేరునా శుభాకాంక్ష‌లు తెలిపారు ఎంపీ. ఏ విశ్వాసంతో ప్రజలు మనల్ని గెలిపించారో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఒకసారి నచ్చితే ప్రజలు మన‌ల్ని వదులుకోరని అన్నారు.

  • Related Posts

    గంగ‌మ్మ త‌ల్లీ ఏపీని క‌రుణించు : నారా భువ‌నేశ్వ‌రి

    చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కుప్పం ప‌ర్య‌ట‌నలో బిజీగా ఉన్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడవ రోజున బుధ‌వారం వసనాడులోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. గంగమ్మ తల్లిని దర్శించుకుని, రాష్ట్రంలో నీటి ఎద్దడి…

    పార్టీ గీత దాటితే వేటు త‌ప్ప‌దు : టీడీపీ చీఫ్

    అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ అత్యంత క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇటీవ‌ల కొంద‌రు త‌మ ఇష్టానుసారం బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడుతున్నార‌ని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *