శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు

Spread the love

ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప యాగం నిర్వ‌హ‌ణ

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల‌లో తిరుప‌తిలోని ప్రసిద్ద ఆల‌యం శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఉత్స‌వాలలో భాగంగా ఏప్రిల్ 11, 18, 25వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తార‌ని పేర్కొంది. ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుందని తెలిపింది. రాత్రి 7 గంట‌లకు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తార‌ని పేర్కొంది టీటీడీ

ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌కు భారీ ఎత్తున భ‌క్త బాంధ‌వులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేసింది. ఈ మేర‌కు టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపింది. కాగా ఉత్స‌వాలను తిలకించేందుకు వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది టీటీడీ.

  • Related Posts

    ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు

    Spread the love

    Spread the loveఅంగ‌రంగ వైభ‌వంగా స్వామి వారి ధ్వ‌జారోహ‌ణం ఒంటిమిట్ట / తిరుప‌తి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. నిన్న‌ రాత్రి ధ్వజావరోహణంతో…

    రూ. 250 కోట్ల‌తో నెద‌ర్లాండ్స్ లో శ్రీ‌వారి ఆల‌యం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల‌తో ప్రపంచ వ్యాప్తంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *