శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు

Spread the love

ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప యాగం నిర్వ‌హ‌ణ

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల‌లో తిరుప‌తిలోని ప్రసిద్ద ఆల‌యం శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఉత్స‌వాలలో భాగంగా ఏప్రిల్ 11, 18, 25వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తార‌ని పేర్కొంది. ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుందని తెలిపింది. రాత్రి 7 గంట‌లకు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తార‌ని పేర్కొంది టీటీడీ

ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌కు భారీ ఎత్తున భ‌క్త బాంధ‌వులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేసింది. ఈ మేర‌కు టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపింది. కాగా ఉత్స‌వాలను తిలకించేందుకు వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది టీటీడీ.

  • Related Posts

    భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

    Spread the love

    Spread the loveగంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే…

    హ‌తీరాంజీ మ‌ఠం కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

    Spread the love

    Spread the loveఅర్జున్ దాస్ కు మ‌ఠాధిప‌తి గా కొన‌సాగింపు తిరుప‌తి : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్తానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధానంగా తిరుప‌తిలోని హ‌తీరాంజీ మ‌ఠం కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *