బాస‌ర ఆల‌యంలో సీఎం పూజ‌లు

మ‌న‌వ‌డికి అక్ష‌ర అభ్యాసం

నిర్మ‌ల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఇక్క‌డికి ప్ర‌తి నిత్యం అక్ష‌ర అభ్యాసం చేయించేందుకు తండ్రులు పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. ఇదిలా ఉండ‌గా దేవస్థానం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు శ్రీ స‌ర‌స్వ‌తి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం ముఖ్యమంత్రి గారికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సంద‌ర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బాస‌ర ఆల‌యాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో పున‌ర్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌ర్బంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ఆల‌య అభివృద్ది ప‌నుల‌కు రూ. 225 కోట్ల నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం. ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశామ‌న్నారు. రాబోయే గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌న్నారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *