బాస‌ర ఆల‌యంలో సీఎం పూజ‌లు

మ‌న‌వ‌డికి అక్ష‌ర అభ్యాసం

నిర్మ‌ల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఇక్క‌డికి ప్ర‌తి నిత్యం అక్ష‌ర అభ్యాసం చేయించేందుకు తండ్రులు పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. ఇదిలా ఉండ‌గా దేవస్థానం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు శ్రీ స‌ర‌స్వ‌తి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం ముఖ్యమంత్రి గారికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి మనవడికి అక్షరాభ్యాసం చేయించారు.

ఈ సంద‌ర్బంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బాస‌ర ఆల‌యాన్ని న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో పున‌ర్ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌ర్బంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ఆల‌య అభివృద్ది ప‌నుల‌కు రూ. 225 కోట్ల నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం. ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశామ‌న్నారు. రాబోయే గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌న్నారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *