తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయం బీజేపీనే

స్ప‌ష్టం చేసిన రామ‌చంద‌ర్ రావు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం కేవ‌లం ఒక్క బీజేపీనేన‌ని స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు. మంగ‌ళ‌వారం బర్కత్‌పురాలోని సిటీ బీజేపీ కార్యాలయంలో రేఖా శర్మ తో కలిసి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం, 12 ఏళ్ల సుపరిపాలనలో.. నిర్ణయాత్మక నాయకత్వం, అభివృద్ధి ఆధారిత పాలనతో దేశం సాధించిన అద్భుత ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశరు.

తెలంగాణలో ఏకైక విశ్వసనీయ ప్రత్యామ్నాయం బీజేపీయేన‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని చెప్పారు. వారిని మ‌న వైపు ఎలా తిప్పుకోవాల‌నే దానిపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. ప్రజలు మనవైపు ఎంతో ఆశతో చూస్తున్నార‌ని, ఆ విష‌యం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు గుర్తించాల‌ని కోరారు. బీఆర్ఎస్ పూర్తిగా ఉనికి కోల్పోయిందంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు మాతో సంప్రదింపులు జరుపుతున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రామ‌చంద‌ర్ రావు. అలాగే ప్రధాని పిలుపు మేరకు “మేరా భారత్, మేరా యోగ్‌దాన్” జాతీయ కార్యక్రమంలో కార్యకర్తలంతా పూర్తి అంకితభావంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు..

  • Related Posts

    సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి

    అమ‌రావ‌తి : సాగు నీటి రంగానికి సంబంధించి ఇంజ‌నీర్ కేఎల్ రావు చేసిన కృషి ఎన‌లేద‌ని కొనియాడారు ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసీ లాంటి ప్రధానమైన డ్యామ్ ల నిర్మాణంలో కేఎల్…

    సాగు నీటి రంగానికి ఏపీ స‌ర్కార్ ప్రాధాన్య‌త

    అమ‌రావ‌తి : వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులు అనుసంధానం జరగాలన్నదే నా ఆకాంక్ష అని ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో నదులు అనుసంధానమైతే భారత్ దేశానికి తిరుగు ఉండదు అన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *